పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
వైతెపాను ఎందులోనూ విలీనం చేయనని, ఏ ఇతర పార్టీలతోనూ పొత్తులు ఉండబోవని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల స్పష్టం చేశారు.
కేసీఆర్కు పది ప్రశ్నలు సంధిస్తూ గోడపత్రిక ఆవిష్కరించిన షర్మిల
నారాయణగూడ, న్యూస్టుడే: వైతెపాను ఎందులోనూ విలీనం చేయనని, ఏ ఇతర పార్టీలతోనూ పొత్తులు ఉండబోవని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి గురువారం ఆమె నివాళి అర్పించారు. దశాబ్ది ఉత్సవాలు చేసే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తన 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. ‘మీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారని, మీకు ఏపీ పీసీసీ చీఫ్ లేదా రాజ్యసభ అవకాశం ఇస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది నిజమేనా’ అని మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించారు. షర్మిల స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. ప్రతిపక్షాలైన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతుంటే.. భాజపా ఆయనతో డ్యూయెట్లు పాడుతోంది. మేమే కదా ప్రజల పక్షాన నిలబడి అడుగడుగునా కేసీఆర్ను ప్రశ్నిస్తోంది. మా పార్టీని ఇంకో దానిలో విలీనం చేయడానికి నేను ఇంత కష్టపడాలా..? నేను ఏదైనా పార్టీలో చేరతానంటే ఎవరైనా వద్దంటారా..? మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. పొత్తులపై అన్ని పార్టీలు పరస్పరం మాట్లాడుకుంటాయి. కాంగ్రెస్కు ఓటు వేస్తే కేసీఆర్కు వేసినట్లే అనుకుంటున్నప్పుడు అలాంటి పార్టీతో పొత్తు అవసరమా’ అని షర్మిల ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?