JP Nadda: వైకాపాకు ఓటేస్తే జగన్ కుటుంబానికే మేలు: జేపీ నడ్డా
ఆంధ్రప్రదేశ్లో వైకాపాకి ఓటు వేస్తే.. జగన్ రెడ్డి కుటుంబానికే మేలు జరుగుతుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.
భరత్పుర్ (రాజస్థాన్) : ఆంధ్రప్రదేశ్లో వైకాపాకి ఓటు వేస్తే.. జగన్ రెడ్డి కుటుంబానికే మేలు జరుగుతుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రాజకీయ సంస్కృతి మారిందని, ఇప్పుడు పార్టీల పేరుతో కుటుంబ పాలన నిర్వహిస్తున్న వారు ప్రమాదంలో పడ్డారని అన్నారు. గురువారం రాజస్థాన్లోని భరత్పుర్లో జరిగిన ఓ ర్యాలీలో నడ్డా ప్రసంగించారు. ‘‘ఆర్జేడీకి ఓటు వేస్తే.. లాలూ కుటుంబానికి, సమాజ్వాదీకి వేస్తే అఖిలేశ్ కుటుంబానికి, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి వేస్తే ఠాక్రే కుటుంబానికి, ఎన్సీపీకి వేస్తే... శరద్పవార్ కుటుంబానికి, తృణమూల్కు వేస్తే.. మమతా బెనర్జీ.. ఆమె మేనల్లుడు అభిషేక్కు, వైకాపాకు వేస్తే.. జగన్రెడ్డి కుటుంబానికి వేసినట్లే. కానీ మీరు మోదీకి వేస్తే అది దేశం కోసం, మీ చిన్నారుల భవిష్యత్తు కోసమని గుర్తుంచుకోండి’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!