JP Nadda: వైకాపాకు ఓటేస్తే జగన్‌ కుటుంబానికే మేలు: జేపీ నడ్డా

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకి ఓటు వేస్తే.. జగన్‌ రెడ్డి కుటుంబానికే మేలు జరుగుతుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.

Published : 30 Jun 2023 07:32 IST

భరత్‌పుర్‌ (రాజస్థాన్‌) : ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకి ఓటు వేస్తే.. జగన్‌ రెడ్డి కుటుంబానికే మేలు జరుగుతుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రాజకీయ సంస్కృతి మారిందని, ఇప్పుడు పార్టీల పేరుతో కుటుంబ పాలన నిర్వహిస్తున్న వారు ప్రమాదంలో పడ్డారని అన్నారు. గురువారం రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో జరిగిన ఓ ర్యాలీలో నడ్డా ప్రసంగించారు. ‘‘ఆర్జేడీకి ఓటు వేస్తే.. లాలూ కుటుంబానికి, సమాజ్‌వాదీకి వేస్తే అఖిలేశ్‌ కుటుంబానికి, ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన వర్గానికి వేస్తే ఠాక్రే కుటుంబానికి, ఎన్సీపీకి వేస్తే... శరద్‌పవార్‌ కుటుంబానికి, తృణమూల్‌కు వేస్తే.. మమతా బెనర్జీ.. ఆమె మేనల్లుడు అభిషేక్‌కు, వైకాపాకు వేస్తే.. జగన్‌రెడ్డి కుటుంబానికి వేసినట్లే. కానీ మీరు మోదీకి వేస్తే అది దేశం కోసం, మీ చిన్నారుల భవిష్యత్తు కోసమని గుర్తుంచుకోండి’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని