YS Sharmila: కాంగ్రెస్లో వైతెపా విలీనంపై కొలిక్కి రాని షర్మిల ప్రయత్నాలు
కాంగ్రెస్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) విలీనానికి ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కిరాలేదు.
ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) విలీనానికి ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. వైతెపాను కాంగ్రెస్లో విలీనం చేసేందుకు షర్మిల కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానంలోని ముఖ్యులతో ఆమె, భర్త అనిల్ కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నారు. గత రెండు రోజుల్లోనూ ఇదే పనిపై షర్మిల దిల్లీలో ఉన్నారు. ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, సంబంధిత వ్యవహారాల్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నిమగ్నమవడంతో గురువారం షర్మిలకు వారి అపాయింట్మెంట్ లభించలేదు. శుక్రవారం ఉదయం ఆమె ఖర్గేను కలిశారు. కానీ తెలంగాణ పీసీసీ నాయకత్వంతో పాటు పలువురు బలహీన వర్గాలకు చెందిన నాయకులు ఆమె చేరికపై విముఖత చూపుతున్నారు. తెలంగాణ వ్యతిరేక వైఖరిని బాహాటంగా ప్రకటించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తెను పార్టీలో చేర్చుకుంటే ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవడం ఖాయమని అధిష్ఠానానికి తేల్చిచెప్పారు. పార్టీని విలీనం చేసి ఆమె ఆంధ్రప్రదేశ్ను కార్యస్థలంగా ఎంచుకుంటే అక్కడ పార్టీ బలోపేతమవుతుందని, ఆమె ఆ రాష్ట్రంలో పనిచేస్తే తమకు ఇబ్బంది లేదని వారు వివరించారు. కాంగ్రెస్ అధిష్ఠానం సైతం షర్మిలకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. శుక్రవారం మధ్యాహ్నమే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోవడంతో విలీన చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో షర్మిల కూడా సాయంత్రం హైదరాబాద్ వెళ్లిపోయారు.
షర్మిలతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తా: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
శంషాబాద్, న్యూస్టుడే: వైఎస్సార్ కుమార్తె షర్మిల కాంగ్రెస్లోకి వస్తానంటే ఆహ్వానిస్తామని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. దిల్లీ నుంచి శుక్రవారం రాత్రి వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్కు ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలోనే ఎక్కువ అభిమానులు ఉన్నారన్నారు. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని.. ఆయన కుమార్తె షర్మిలతో కలిసి కాంగ్రెస్లో పనిచేయడం అదృష్టంగా భావిస్తామన్నారు. కాంగ్రెస్లో వైఎస్సార్కు ఉన్న గౌరవం షర్మిలకు కూడా ఉంటుందన్నారు. వైతెపాను కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమెనే అడగాలని ఆయన సమాధానమిచ్చారు. ఇదే విమానంలో దిల్లీ నుంచి వచ్చిన షర్మిల మాత్రం విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ