Komatireddy Venkat Reddy: నేను చెప్పినవారికే నకిరేకల్‌ టికెట్‌: కోమటిరెడ్డి

నకిరేకల్‌ నియోజకవర్గంలో తానే నాయకుడినని, తాను చెప్పిందే ఫైనల్‌ అని, పార్టీ కార్యకర్తలు ప్రతిపాదించిన వ్యక్తికే ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు.

Updated : 27 Aug 2023 07:26 IST

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: నకిరేకల్‌ నియోజకవర్గంలో తానే నాయకుడినని, తాను చెప్పిందే ఫైనల్‌ అని, పార్టీ కార్యకర్తలు ప్రతిపాదించిన వ్యక్తికే ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. నకిరేకల్‌ నియోజకవర్గ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో శనివారం తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో ఎంపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఎవరో పార్టీలో చేరతారు. ఇంకెవరో అభ్యర్థి అనే ప్రచారాన్ని నమ్మొద్దు. అధిష్ఠానంతో సంబంధం లేకుండా నేను ఎవరి పేరును ప్రతిపాదిస్తే వారికే టికెట్‌ వస్తుంది. నిన్నటి వరకు వేముల వీరేశం భారాస టికెట్‌ వస్తుందని ఆశించారు. టికెట్‌ రాదని తెలిసే సరికి కేసీఆర్‌ ఫొటో పక్కన పెట్టి కాంగ్రెస్‌ అంటున్నారు. సోమవారం నార్కట్‌పల్లి పట్టణంలో కార్యకర్తలతో మరో సమావేశం నిర్వహించి, వారి నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తాం. రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోంది. టికెట్‌ రాని నాయకులకు న్యాయం జరుగుతుంది’’ అని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని