వైకాపా కోవర్టు ఎంపీ కేశినేని నాని: మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

విజయవాడ ఎంపీ కేశినేని నాని పచ్చి మోసగాడని, వైకాపా కోవర్టు అని తెదేపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు.

Updated : 19 Jan 2024 06:57 IST

విజయవాడ (విద్యాధరపురం), న్యూస్‌టుడే: విజయవాడ ఎంపీ కేశినేని నాని పచ్చి మోసగాడని, వైకాపా కోవర్టు అని తెదేపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. గురువారం విజయవాడ మల్లికార్జునపేటలోని తెదేపా కార్యాలయంలో నాయకులు కేశినేని చిన్ని, నాగుల్‌మీరాలతో కలసి ఆయన ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ తెదేపాలో ఉన్న ఎంపీ కేశినేని నాని వైకాపాలో చేరేందుకు వెళ్తున్న దేవినేని అవినాష్‌ను ఆపలేని అసమర్థుడన్నారు. తెదేపాలో అవినీతిపరులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ఆధారాలు చూపి పేర్లతో విమర్శించాలని సవాలు చేశారు. ప్రజారాజ్యం నుంచి చిరంజీవి, తెదేపా నుంచి చంద్రబాబు గెంటేసినా బుద్ధి రాని నానీని వైకాపా అధినేత జగన్‌ కాలితో తన్ని తరిమేస్తారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని