Jagga Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరమా కూలిపోవడానికి?: జగ్గారెడ్డి
‘కూలిస్తే కూలిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అనుకుంటున్నారా’ అని భారాస నేతలను ఉద్దేశించి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, న్యూస్టుడే: ‘కూలిస్తే కూలిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అనుకుంటున్నారా’ అని భారాస నేతలను ఉద్దేశించి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన గురువారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్లో అంతర్యుద్ధం జరగడం లేదు. భారాసలోనే జరిగి తీరుతుంది. కేసీఆర్కు వెన్నుపోటు పొడవడానికి హరీశ్రావు సిద్ధంగా ఉన్నారు. 20 మంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారు. మాజీమంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లోకి రావొచ్చు. రాజకీయంగా మీరు నేర్పిన విద్యనే.. ఆ దారిలోనే మేమూ ప్రయాణం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వమేమీ నాసిరకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదు’’ అని వ్యాఖ్యానించారు. తనను మించిన వారు లేరని కామారెడ్డిలో పోటీచేసిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయారో మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పాలన్నారు. సంగారెడ్డిలో హరీశ్రావు రూ.60 కోట్లు పంచారని ఆరోపించారు. ‘‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏనాడైనా ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా వెళ్లి కలిశారా? అదే కాంగ్రెస్లో ఎవరైనా వెళ్లి సీఎంను కలిసే అవకాశం ఉంది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
-
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
-
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’