Mutual Funds: మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
Mutual Funds | ముంబయి: సంయుక్తంగా నిర్వహించే మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) ఖాతాలకు నామినీ ఎంపికను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐచ్ఛికం (Optional) చేసింది. ఈ పెట్టుబడి సాధనంలో మదుపు ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కమొడిటీ, విదేశీ పెట్టుబడుల పర్యవేక్షణకు ఒకే ఫండ్ మేనేజర్ ఉండటానికి ఫండ్ హౌస్లకు అనుమతించింది.
సెబీ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) నిబంధనలను సమీక్షించి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. పై రెండు సిఫార్సులపై సెబీ విస్తృత సంప్రదింపులు జరిపింది. జాయింట్ హోల్డర్లకు నామినీ నిబంధనల సడలింపు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు తెలిపారు. ఎవరైనా ఒకరికి జరగకూడనిది జరిగిన సమయంలో నిధుల బదిలీ సహా ఇరత ప్రక్రియలు సులువవుతాయని వివరించారు. జీవించి ఉన్న సభ్యుడిని నామినీగా చేర్చడాన్ని ఈ నిబంధన అవకాశం కల్పిస్తుందన్నారు.
మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) హోల్డర్లు నామినీని ఎంపిక చేయడం.. లేదా అవసరం లేదని తెలియజేయడాన్ని సెబీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దానికి 2024 జూన్ 30ని గడువుగా విధించింది. లేదంటే గడువు తర్వాత నిధులను విత్డ్రా చేసుకోవడం కుదరదు. అయితే, తాజా ఉత్తర్వుల్లో జాయింట్ అకౌంట్ హోల్డర్లకు మాత్రం మినహాయింపునివ్వడం వల్ల పై నిబంధనలను సడలించినట్లయింది.
మరోవైపు గోల్డ్ ఈటీఎఫ్లు (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్), సిల్వర్ ఈటీఎఫ్లు, కమొడిటీ మార్కెట్లో పాల్గొనే ఇతర ఫండ్ల వంటి కమొడిటీ ఆధారిత ఫండ్లకు ప్రత్యేక మేనేజర్ను నియమించడం ఐచ్ఛికం అని సెబీ తెలిపింది. అలాగే, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ నిర్వహణకు సైతం విధిగా ఫండ్ మేనేజర్ను నియమించడం తప్పనిసరి కాదని తెలిపింది. దేశీయ, విదేశీ/కమొడిటీ ఫండ్ల కోసం ఒకే మేనేజర్ ఉండడం వల్ల నిర్వహణ వ్యయం తగ్గుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ రివార్డులు ఉండవిక..
అమెజాన్పే- ఐసీఐసీఐ కో బ్రాండ్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే జూన్ 18 నుంచి రివార్డు పాయింట్లలో కొన్ని మార్పులు రానున్నాయి. -
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
ఏఐని సమర్థంగా అర్థం చేసుకోగల వారిదే భవిష్యత్ అని ఇన్ఫోసిస్ సీటీఓ రఫీ అన్నారు. ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐ టూల్స్ నేర్చుకోవడం ముఖ్యమని చెప్పారు. -
రాజస్థాన్లో రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న JSW సిమెంట్
రాజస్థాన్లో కొత్త సిమెంట్ తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు JSW సిమెంట్ రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. -
నీ తండ్రి స్థాయేంటో తెలుసా అన్నారు : జొమాటో సీఈఓ
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తాను స్టార్టప్ ప్రారంభించాలనుకున్న తొలి రోజుల గురించి గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ @ 5 ట్రిలియన్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడింది. -
రీకాల్, కోక్రియేట్ ఫీచర్లతో ఏఐ తరం కోసం మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పీసీలు
Microsoft Copilot+ PCs: ఏఐ ఫీచర్లతో మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పేరిట కొత్త పీసీలను విడుదల చేసింది. వీటిలో రీకాల్, కోక్రియేట్ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. -
చైనాలో ఐఫోన్లపై యాపిల్ భారీ డిస్కౌంట్స్.. ఏడాదిలో రెండోసారి.. ఎందుకంటే?
చైనాలో ఐఫోన్లపై యాపిల్ సంస్థ భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఏడాదిలో ఇలా డిస్కౌంట్ ఇవ్వడం ఇది రెండోసారి. -
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,455
Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 73,906 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు కుంగి 22,455 దగ్గర కొనసాగుతోంది. -
పారిశ్రామిక ప్రముఖులు ఓటేశారు
లోక్సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్లో, సోమవారం ముంబయిలో పారిశ్రామిక ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
విద్యుత్తు విధాన మార్గదర్శకాలు త్వరలో
మనదేశంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈవీ నూతన విధాన మార్గదర్శకాలను ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. -
సానుకూలతలున్నా.. అప్రమత్తతే!
ఎన్నికల అనంతరం అధికారం చేపట్టే పార్టీ విషయమై అనిశ్చితి వల్ల అప్రమత్తతతో ఉన్నా, నిఫ్టీ-50 ఈ వారం సానుకూలతలను కనబరచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
74,360 ఎగువన లాభాలు కొనసాగొచ్చు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. డీఐఐల కొనుగోళ్లు, స్థిరమైన చమురు ధరలు ఇందుకు దోహదపడ్డాయి. -
ఇండియా సిమెంట్స్కు తగ్గిన నష్టం
ఇండియా సిమెంట్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.50.06 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. -
ఆయిల్ ఇండియా 2 షేర్లకు ఒకటి బోనస్
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.2,332.94 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. -
దిల్లీలో ఉబర్ బస్సు సేవలు
‘దిల్లీ ప్రీమియం బస్ స్కీమ్’ కింద దేశ రాజధానిలో బస్సులు తిప్పేందుకు దిల్లీ రవాణా విభాగం నుంచి అగ్రిగేటర్ లైసెన్స్ పొందినట్లు ఉబర్ వెల్లడించింది. -
ఎస్బీఐ ఛైర్మన్ పదవికి నేడు ఇంటర్వ్యూలు
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ పదవికి అర్హులైన అభ్యర్థుల ఇంటర్వ్యూలను ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) మంగళవారం నిర్వహించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్లో ఐఎస్బీకి దేశంలో ప్రథమ స్థానం
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్- 2024 లో మనదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. -
విస్తరణ దిశగా నెక్స్ట్వేవ్
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే హైదరాబాదీ ఎడ్యుటెక్ అంకురం నెక్ట్స్వేవ్ విస్తరణ బాట పట్టింది. -
మార్చిలో 14.41 లక్షల మంది చేరిక: ఈపీఎఫ్ఓ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో ఈ ఏడాది మార్చిలో నికరంగా 14.41 లక్షల మంది సభ్యులు చేరారు. -
సుగంధ ద్రవ్యాల ఎగుమతులపై కేంద్రం మార్గదర్శకాలు
మనదేశం నుంచి ఎగుమతి అయ్యే సుగంధ ద్రవ్యాలు ఎథిలీన్ ఆక్సైడ్ (ఈటీఓ)తో కలుషితం కాకుండా ఉండేలా చూడడం కోసం కేంద్రం సవివర మార్గదర్శకాలను జారీ చేసింది. -
సంక్షిప్త వార్తలు
పవర్ మెక్ ప్రాజెక్ట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,311.86 కోట్ల ఆదాయంపై రూ.84.41 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.