గుజరాత్లో ఆప్ ప్రచార తారలుగా కేజ్రీవాల్, సిసోదియా
మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు గుజరాత్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే 40 మంది పార్టీ ప్రచార తారలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం ప్రకటించింది.
దిల్లీ: మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు గుజరాత్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే 40 మంది పార్టీ ప్రచార తారలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం ప్రకటించింది. వారి పేర్లతో కూడిన జాబితాను ఎన్నికల కమిషన్కు ఆప్ సమర్పించింది. ఆ ప్రకారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీత, పార్టీ సీనియర్ నేతలు మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్లు ప్రచార తారలుగా వ్యవహరించనున్నారు. ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, రాఘవ్ చడ్డా, సందీప్ పాఠక్ల పేర్లూ జాబితాలో ఉన్నాయి. కేజ్రీవాల్, సిసోదియా, సత్యేంద్ర జైన్ తిహాడ్ జైల్లో ఉన్నారు. రాజ్యసభ సభ్యులైన హర్బజన్ సింగ్, స్వాతి మాలీవాల్ పేర్లు జాబితాలో లేకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్