గుజరాత్‌లో ఆప్‌ ప్రచార తారలుగా కేజ్రీవాల్‌, సిసోదియా

మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించే 40 మంది పార్టీ ప్రచార తారలను ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మంగళవారం ప్రకటించింది.

Published : 17 Apr 2024 04:23 IST

దిల్లీ: మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించే 40 మంది పార్టీ ప్రచార తారలను ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మంగళవారం ప్రకటించింది. వారి పేర్లతో కూడిన జాబితాను ఎన్నికల కమిషన్‌కు ఆప్‌ సమర్పించింది. ఆ ప్రకారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆయన భార్య సునీత, పార్టీ సీనియర్‌ నేతలు మనీశ్‌ సిసోదియా, సత్యేంద్ర జైన్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌లు ప్రచార తారలుగా వ్యవహరించనున్నారు. ఆప్‌ రాజ్యసభ సభ్యులు సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చడ్డా, సందీప్‌ పాఠక్‌ల పేర్లూ జాబితాలో ఉన్నాయి. కేజ్రీవాల్‌, సిసోదియా, సత్యేంద్ర జైన్‌ తిహాడ్‌ జైల్లో ఉన్నారు. రాజ్యసభ సభ్యులైన హర్బజన్‌ సింగ్‌, స్వాతి మాలీవాల్‌ పేర్లు జాబితాలో లేకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని