19, 24 తేదీల్లో ఉమ్మడి వరంగల్‌లో సీఎం ఎన్నికల ప్రచారం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19, 24 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు.

Published : 18 Apr 2024 04:02 IST

మడికొండ, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19, 24 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. 19న సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌కు చేరుకుంటారు. స్థానిక ఎన్టీఆర్‌ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే రోజు ఉదయం కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ నామినేషన్‌ వేయనున్నారు. 24న హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగ సభలోనూ రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. బుధవారం సాయంత్రం మడికొండ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ కార్యాలయం ముందున్న ఖాళీ స్థలాన్ని బహిరంగ సభ కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని