India W vs Bangladesh W: వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
బంగ్లాదేశ్తో ఐదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.
సిల్హెట్: బంగ్లాదేశ్తో ఐదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సిల్హెట్ వేదికగా జరిగి మ్యాచ్లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో విజేతను ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటయ్యింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 5.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో వరుణుడు ఆటంకం కలిగించాడు. జల్లులు తగ్గకపోవడం, అప్పటికే ఐదు ఓవర్లు పూర్తవడంతో డీఎల్ఎస్ పద్ధతిలో విజేతను ఖరారు చేశారు.
భారత్ బ్యాటర్లలో ఓపెనర్ షఫాలీ వర్మ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగింది. స్మృతి మంధాన (5*), దయాళన్ హేమలత ( 41*) నాటౌట్గా నిలిచారు. అంతకుముందు బంగ్లాదేశ్ బ్యాటర్లలో ముర్షిదా ఖతున్ (46), రితు మోని (20), మోస్తరే (19) ఆకట్టుకున్నారు. భారత్ బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ తలో 2, పూజా వస్త్రాకర్ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి.. జట్లు ఇవే!
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా వాంఖడే వేదికగా మరికాసేపట్లో ముంబయి, లఖ్నవూ మధ్య మ్యాచ్ జరగనుంది. -
కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్కు చేరుస్తుందా?
ఐపీఎల్ ప్లేఆఫ్స్నకు ఇప్పటికే మూడు జట్లు చేరాయి. టాప్ 4లోకి చేరే నాలుగో జట్టు ఏదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు. -
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్పై అతడి ఆప్తమిత్రుడు విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ నిర్ణయంతో అతడికి సంతృప్తి లభించిందని అనుకొంటున్నట్లు వెల్లడించాడు. -
ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్
మే 18న బెంగళూరు - చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇదే ఇరు జట్లకూ లీగ్ స్టేజ్లో చివరిది కావడం గమనార్హం. మరోవైపు ప్లేఆఫ్స్కు కీలకంగా మారిన మ్యాచ్ కావడంతో ఆసక్తి నెలకొంది. -
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
ఐపీఎల్ 17వ సీజన్లో క్రికెట్ అభిమానులు శనివారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాకౌట్ దశకు వెళ్లే నాలుగో జట్టు ఏంటా? అనేది తేలేదప్పుడే. -
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్
ముంబయి జట్టు ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. రోహిత్, ఇషాన్, హార్దిక్ వంటి వారిని వదిలేయాలన్నాడు. స్టార్లతో నిండిపోయినంత మాత్రాన జట్టు విజయం సాధించదని అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
పొట్టి ఫార్మాట్ వచ్చాక బౌలర్లపై బ్యాటర్లదే ఆధిపత్యం. మరీ ముఖ్యంగా ఐపీఎల్ వంటి లీగుల్లో ఇది ఎక్కువైంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. -
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
నాలుగు మ్యాచ్లు ఉన్నా సరే.. ఒకే ఒక్క పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే చివరి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసే అవకాశం ఉంది. -
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం. -
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజనమే.. 3 కి.మీ మేర క్యూలైను
-
వాళ్లను భారత్ గౌరవిస్తే.. మనం ‘దొంగలు’ అంటున్నాం- పాకిస్థాన్ మంత్రి
-
చార్ ధామ్లో ఇకపై రీల్స్ చిత్రీకరణ నిషిద్ధం
-
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి.. జట్లు ఇవే!