ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కేసీఆర్‌ సర్కారు: వైఎస్‌ షర్మిల

యువత ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజా సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గాలికొదిలేశారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రను సూర్యాపేట జిల్లా కేంద్రంలో

Published : 30 Jun 2022 05:39 IST

సూర్యాపేట, న్యూస్‌టుడే: యువత ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజా సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గాలికొదిలేశారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రను సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ సంక్షేమం చూసి మురిసిపోతున్న కేసీఆర్‌ పాలనను అంతం చేయడానికే ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టానన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యను తరిమికొట్టేందుకు శ్రీరాంసాగర్‌ కాల్వ రెండోదశ ప్రాజెక్ట్‌ ద్వారా జలయజ్ఞం పథకానికి వైఎస్‌ఆర్‌ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి జగదీశ్‌రెడ్డి రెండు దఫాలుగా గెలిచి మంత్రి అయ్యి రూ.5 వేల కోట్లు కూడబెట్టుకున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని