Amit Shah: సీఎంల ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్.. అమిత్ షా ఆసక్తికర పోస్టు!
భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు.
న్యూదిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా (BJP)దేశంలోని మూడు కీలక రాష్ట్రాల్లో విజయం సాధించించి మంచి జోష్లో ఉంది. మధ్యప్రదేశ్ (Madhyapradesh)లో అధికారాన్ని నిలుపుకోవడమే కాకుండా రాజస్థాన్ (Rajasthan), ఛత్తీస్గఢ్ (Chhattisgarh)ఎన్నికల్లో ప్రత్యర్థి కాంగ్రెస్ (Congress)ను ఓడించింది. అయితే ఫలితాలు వచ్చి ఏడు రోజులు అవుతున్నా ఇంతవరకు ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో ఇటు కాంగ్రెస్తో పాటు అటు దేశంలోని ప్రధానపార్టీల నుంచి భాజపా విమర్శలు ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేశారు. తన మనవరాళ్లతో కలిసి చదరంగం (chess)ఆడుతున్న ఫొటోను పంచుకుని దానికి ఒక క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ఒక మంచి ఎత్తుగడతో ఆగిపోకండి. ఎప్పటికీ ఉత్తమమైన దాని కోసం చూడండి’’ అని పేర్కొన్నారు. దీంతో ఆ పోస్టు ఆసక్తికరంగా మారింది. సీఎంల ఎంపికలో ఉత్కంఠ కొనసాగుతుండడంపై విమర్శలకు కౌంటర్గానే అమిత్ ఈ పోస్టు చేశారని పలువురు భావిస్తున్నారు.
ఇప్పటికే మూడు రాష్ట్రాలకు సీఎం ఎవరనేది నిర్ణయించడానికి భాజపా పరిశీలకులను నియమించింది. మధ్యప్రదేశ్ పరిశీలకులుగా హరియాణా సీఎం మనోహర్లాల్ ఖట్టర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి ఆశా లక్డా, రాజస్థాన్ పరిశీలకులుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎంపీ సరోజ్ పాండే, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ థావ్డే, ఛత్తీస్గఢ్కు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, శర్బానంద సోనోవాల్, భాజపా ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ను నియమించారు. సోమవారం నాటికి సీఎంలను ప్రకటించవచ్చని భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్