Rahul Gandhi: వైఎస్‌ షర్మిల, సునీతపై అవమానకర దాడిని ఖండిస్తున్నా: రాహుల్‌

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖండించారు.

Updated : 04 Feb 2024 13:38 IST

దిల్లీ: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికిపంద చర్యని ధ్వజమెత్తారు. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో శక్తిహీనులకు ఇది ఒక ఆయుధంగా మారిపోయిందని ఆక్షేపించారు. వైఎస్ షర్మిల, సునీతపై జరిగిన ఈ అవమానకర దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని ‘ఎక్స్’(ట్విటర్‌) వేదికగా రాహుల్ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని