Agnipath: వారిని సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకుంటాం.. అగ్నివీరులపై వివాదాస్పద వ్యాఖ్యలు!
అగ్నిపథ్ (Agnipath scheme) పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భాజపాకు (BJP) చెందిన నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దిల్లీ: అగ్నిపథ్ (Agnipath scheme) పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భాజపాకు (BJP) చెందిన నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివీరులను (Agniveers) తమ పార్టీ ఆఫీసుకు సెక్యూరిటీగా గార్డులుగా పెట్టుకుంటామంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో.. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ సర్ది చెప్పుకొనే ప్రయత్నం చేశారు.
అగ్నిపథ్పై (Agnipath scheme) ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుండగా.. మరోవైపు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ ప్రభుత్వం ఓ వైపు పథకం ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన భాజపా నేత కైలాష్ విజయ్ వర్గీయ ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ నోరు జారారు. ‘‘మిలటరీ శిక్షణ తీసుకున్న అగ్నివీరులు నాలుగేళ్ల తర్వాత సర్వీసు నుంచి వైదొలుగుతారు. అప్పుడు వారికి రూ.11 లక్షలు వస్తాయి. వారికి అగ్నివీర్ బ్యాడ్జ్ కూడా వస్తుంది. ఒకవేళ నేను భాజపా ఆఫీసుకు సెక్యూరిటీని నియమించాలనుకుంటే అగ్నివీరులకు ప్రాధాన్యం ఇస్తా’’ అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది.
కైలాష్ విజయ్ వర్గీయ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, శివసేన, ఎంఐఎం మండిపడ్డాయి. దేశ యువత రాత్రింబవళ్లు కష్టపడేది సైనికుడిగా దేశం కోసం సేవ చేయడానికేగానీ, భాజపా కార్యాలయాల వద్ద కాపలా కాయడానికి కాదు అంటూ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ పథకంపై ఉన్న అనుమానాలన్నింటినీ కైలాష్ విజయ్ వర్గీయ నివృత్తి చేశారంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామంటూ వ్యాఖ్యానించడం అంటే సాయుధ బలగాలను చిన్న చూపు చూడడమే అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. అగ్నివీరులను పార్టీ ఆఫీసులకు కాపాలా పెట్టుకుంటామంటారా? ఇదేనా సైనికులకు భాజపా ఇచ్చే గౌరవం? అంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో కైలాష్ విజయ్ వర్గీయ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను టూల్ కిట్ గ్యాంగ్ వక్రీకరించిందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్