CM KCR: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది.  బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి చేరుకున్న సీఎం కేసీఆర్‌  ..

Updated : 20 Feb 2022 16:32 IST

ముంబయి: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది.  బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి చేరుకున్న సీఎం కేసీఆర్‌  అక్కడి నుంచి ఉద్ధవ్‌ ఠాక్రే నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. కేసీఆర్‌ బృందానికి మహారాష్ట్ర సీఎం విందు ఏర్పాటు చేశారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక కూటమికి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం కేసీఆర్‌ వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్‌, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని