Arvind Kejriwal: డిన్నర్ విత్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ కొత్త ప్రచారం
ఉత్తరప్రదేశ్ సహా వచ్చే నెలలో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ మరో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ
దిల్లీ: ఉత్తరప్రదేశ్ సహా వచ్చే నెలలో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ మరో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ప్రజలను కోరాలంటూ దిల్లీ ప్రజలను అభ్యర్థించింది. అలా చేసిన వారికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి డిన్నర్ చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ డిజిటల్ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ‘ఏక్ మోకా కేజ్రీవాల్ కో (కేజ్రీవాల్కు ఒక్క అవకాశం ఇవ్వండి) పేరిట నేడు సరికొత్త ప్రచారాన్ని కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దిల్లీ ప్రజల కోసం మా ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. ఉచిత విద్యుత్తు, ఉచిత మంచినీరు వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇక్కడ మేం నడుపుతున్న మెహల్లా క్లినిక్లను చూసేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు వచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మన దిల్లీ పాఠశాలలను సందర్శించారు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. దిల్లీ ప్రజలు నాకు అవకాశం ఇవ్వడం వల్లే ఇవన్నీ చేయగలిగాం. అందువల్ల, యూపీ సహా ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రజలకు కూడా ఈ విషయాలను చెప్పండి. దిల్లీ ప్రభుత్వం చేసిన పనుల పై, వాటి వల్ల మీరు పొందిన ప్రయోజనాల గురించి వీడియోలు చేసి ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి మాధ్యమాల్లో షేర్ చేయండి. కేజ్రీవాల్కు ఒక్క అవకాశం ఇవ్వమని ఆయా రాష్ట్రాల ప్రజలను కోరండి’’ అని కేజ్రీవాల్ దిల్లీ వాసులకు విజ్ఞప్తి చేశారు. అంతేగాక, అలా వీడియోలు చేసిన వారికి తనను నేరుగా కలిసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. వాటిల్లో అత్యధికంగా వైరల్ అయిన 50 మంది దిల్లీ వ్యక్తులను ఎన్నికల తర్వాత ప్రత్యేకంగా ఆహ్వానించి.. వారితో డిన్నర్ చేయనున్నట్లు ప్రకటించారు.
పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్లో ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించేందుకు కేజ్రీవాల్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పంజాబ్లో ఇప్పటికే రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆప్.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా మారనుంది. పంజాబ్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేజ్రీవాల్.. అక్కడ భగవంత్ మాన్ను సీఎంగా అభ్యర్థిగా ప్రకటించారు. ఇక యూపీ, గోవా, ఉత్తరాఖండ్లోనూ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గోవాలో ఇప్పటికే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. ఉత్తరాఖండ్లో రిటైర్డ్ కల్నల్ అజయ్ కొటియాల్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
Pashupati Paras: కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. బిహార్లో చిరాగ్ పాసవాన్కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్)తో భాజపా పొత్తు పెట్టుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. -
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. -
హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. -
ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్
జగన్రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. -
ప్రజాగళం విజయవంతంతోసర్దుకుంటున్న జగన్ సర్కారు
చిలకలూరిపేటలో ఎన్డీఏ సభ (ప్రజాగళం) విజయవంతం కావడంతో జగన్ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమైందని భాజపా అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
వైకాపాలో చేరిన తెదేపా నేత రామచంద్రరావు
విశాఖపట్నానికి చెందిన తెదేపా నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన భార్య సంధ్యారాణి వైకాపాలో చేరారు. సోమవారం వారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు.
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు