Kesineni Swetha: తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని కలలో కూడా ఊహించలేదు: కేశినేని శ్వేత
తెలుగుదేశం పార్టీని వీడాల్సి వస్తుందని తాను, ఎంపీ కేశినేని నాని ఎప్పుడూ ఊహించలేదని శ్వేత అన్నారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని కలలో కూడా ఊహించలేదని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత అన్నారు. కార్పొరేటర్ పదవికి శ్వేత సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను నగర మేయర్కు అందజేశారు. రాజీనామా ఆమోదం తర్వాత తెదేపాను వీడనున్నట్లు చెప్పారు.
అనంతరం శ్వేత మాట్లాడుతూ.. ‘‘పార్టీని వీడాల్సి వస్తుందని నేను, ఎంపీ కేశినేని నాని ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే.. పార్టీ, అధినేత చంద్రబాబుపై మాకున్న అభిమానం, ప్రేమ అలాంటిది. కానీ ఈరోజు పార్టీయే మమ్మల్ని కాదనుకుంటోంది. అధినేతే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. ఒక సిట్టింగ్ ఎంపీ అయిన కేశినేని నానికి.. విజయవాడ ప్రాంతంలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దని సమాచారం వచ్చింది. ఇంత జరిగిన తర్వాత పార్టీలో ఉండడం సరైంది కాదని మేం భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మేం ఎవరినీ తప్పుబట్టడం లేదు. పార్టీ కోసం అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు’’ అని అన్నారు.
తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘తెదేపాకు నా అవసరం లేదని అధినేత చంద్రబాబు భావించిన తరువాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన. కాబట్టి త్వరలోనే దిల్లీ వెళ్లి స్పీకర్ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. దాన్ని ఆమోదించిన మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా’’ అని ఈ నెల 6న ఎక్స్లో నాని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..