Andhra News: నవంబరులోనే ఆహ్వానం వచ్చింది.. తెదేపా నేతలది దుష్ప్రచారమే: మంత్రి అమర్నాథ్
దావోస్లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదంటూ తెదేపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం(వన్టౌన్), న్యూస్టుడే: దావోస్లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదంటూ తెదేపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. మంగళవారం విశాఖ గవర్నర్ బంగ్లాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సులో పాల్గొనాలని గతేడాది నవంబరు 25న సీఎంకు, ప్రభుత్వానికి ఆహ్వానాలు అందాయని చెబుతూ ఆయా లేఖలను మీడియాకు చూపించారు. ఈ ఏడాది మార్చిలో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించాలనే ఉద్దేశంతో సీఎం ఉన్నారని, అందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున దావోస్ సదస్సుకు వెళ్లలేదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో దావోస్ సదస్సుకు వెళ్లి చాలా ఘనత సాధించానని చెప్పుకొంటున్న చంద్రబాబును ఆ వేదికపై ఉపన్యసించాలని నిర్వాహకులు ఎప్పుడైనా ఆహ్వానించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఏడాదికి రూ.11వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. జగన్ పాలనలో ఏడాదికి రూ.15వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరిగే నాటికి కొత్త పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై తెదేపా, జనసేన ఉమ్మడి ప్రచారం చేస్తే మంచిదని, చంద్రబాబు, పవన్లది భార్యాభర్తల బంధమని ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం