Harishrao: సచివాలయం ప్రారంభానికి గవర్నర్ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా?: హరీశ్రావు
సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పందించారు.
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పందించారు. గురువారం హైదరాబాద్లో మంత్రి హరీశ్రావు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.‘‘సచివాలయం ప్రారంభానికి గవర్నర్ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా?వందే భారత్ రైలు ప్రారంభానికి రాష్ట్రపతిని ప్రధాని పిలిచారా? వందే భారత్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు అని అడిగామా? ఎన్ని సార్లు, ఎవరు ప్రారంభించాలో కార్య నిర్వాహక వ్యవస్థ ఇష్టం. గవర్నర్గా, మహిళగా తమిళిసైని గౌరవిస్తాం. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్ వ్యవహరించడం బాధ కలిగిస్తోంది.
వైద్యవిద్య ప్రొఫెసర్ల విరమణ వయసు పెంపు బిల్లు ఏడు నెలలు ఆపడం అవసరమా?సుప్రీంకోర్టు మెట్లెక్కితే తప్ప బిల్లులపై కదలిక రాలేదు.. ఇది సమంజసమా? రాష్ట్రంలో అనుభవం ఉన్న ప్రొఫెసర్లు లేరని పదవీ విరమణ వయసు పెంచాం. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాలు ఇతర రాష్ట్రాలు చేపట్టడం లేదా? విశ్వవిద్యాలయాల బిల్లు ఏడు నెలలు ఆపి తిప్పి పంపడం ఎంత అన్యాయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయడం కదా?రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయడమే. గతంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలకు ఆమోద ముద్రవేసిన గవర్నర్ ఇప్పుడు 7 ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వెనక్కి పంపడం రాజకీయం కాకపోతే మరేమిటి?’’ అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
గవర్నర్ తమిళిసై ఏమన్నారంటే?..
బుధవారం గచ్చిబౌలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ... భారతదేశానికి వచ్చే దేశాధినేతలను సైతం కలుసుకునే అవకాశం ఉంటుంది కానీ.. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రిని కలవలేమని, ఇదో దురదృష్టకరమైన పరిస్థితి అని అన్నారు. కొన్ని దేశాలు దగ్గర కావచ్చుకానీ రాజ్భవన్, ప్రగతిభవన్ మాత్రం కాలేవన్నారు. ‘ఇటీవల పెద్ద సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.. రాష్ట్ర ప్రథమ పౌరురాలికి మాత్రం ఆహ్వానం లేదు’ అని వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రైనా, గవర్నరైనా, మంత్రులైనా ఓపెన్ మైండ్తో ఉండాలని, తమ కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్రం, దేశం కోసం పనిచేయాలని సూచించారు. ‘కొందరు ముందుగా ప్రజలకు మంచి చేసిన తర్వాత ఆ విషయం గురించి మాట్లాడతారు. కానీ కొందరు కేవలం మాటలు చెబుతారే తప్ప ఏమీ చేయరంటూ’ విమర్శించారు. ప్రభుత్వాలు ఏం చేసినా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసమే చేయాలి తప్ప సొంత కుటుంబాల వృద్ధి కోసం కాకూడదన్నారు. ‘రాష్ట్రాన్ని పాలించే వారు ప్రజల కోసం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అహంకారాన్ని పక్కనపెట్టి విశాల దృక్పథంతో పరస్పరం చర్చించుకోవాలి. సమస్యలకు పరిష్కారం చూపాలి’’ అని గవర్నర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ