KTR: కేంద్రం తీరుకు నిరసనగా ఐదంచెల పోరాటం: కేటీఆర్
యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై దిల్లీలోని నాయకులు ఒక విధంగా... గల్లీలోని
హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై దిల్లీలోని నాయకులు ఒక విధంగా... గల్లీలోని నాయకులు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఐదంచెల పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన ఉద్యమ కార్యాచరణను మంత్రి ప్రకటించారు.
దిల్లీ భాజపా నేతలు ఒకలా.. సిల్లీ భాజపా నేతలు మరోలా?
‘‘గతేడాది యాసంగి పంట సమయంలో సీఎం, మంత్రులు పలుమార్లు దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కోరితే... ఏటా కొనుగోలు చేస్తున్న మాట నిజమే. కానీ, ఇకపై పారాబాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పారు. లక్షలాది మంది రైతుల శ్రేయస్సు దృష్ట్యా బాయిల్డ్ రైస్, రా రైస్ అని నిబంధనలు పెట్టొద్దని విజ్ఞప్తి చేశాం. కేంద్రం పెద్దమనసు చేసుకొని నిబంధనలు పెట్టకుండా ధాన్యం కొనాలని చెప్పాం. గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేశారో అలాగే కొనుగోలు చేయాలని కోరాం. ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశాం. కానీ, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రైతుల బాధను అర్థం చేసుకునే ప్రభుత్వం కాదని అర్థమైంది. కేవలం కార్పొరేట్లకు మాత్రమే ఈ ప్రభుత్వం కొమ్ముకాస్తుందని స్పష్టమైంది. దిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మీడియా సమావేశం పెట్టి.. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనుగోలు చేయనంటోంది. యాసంగిలో వరి వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కానీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. వ్యవసాయ మంత్రి ప్రకటనను తప్పుబట్టారు. ముఖ్యమంత్రిని పట్టించుకోవద్దు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయించే బాధ్యత మాది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్నా’’ అని వివిధ సందర్భాల్లో ప్రగల్భాలు పలికారు.
కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీగా బియ్యం కొనుగోలు చేస్తుంది. ఈ యాసంగిలో రా రైస్ పండించినా, బాయిల్డ్ రైస్ పండించినా కేంద్ర ప్రభుత్వమే ప్రతి గింజా కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. యాసంగిలో ధాన్యం కొంటారా? కొనరా? దిల్లీలో మాట్లాడుతున్న భాజపా కరెక్టా? ఇక్కడ మాట్లాడుతున్న సిల్లీ భాజపా కరెక్టా? రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దు. భారతదేశం మొత్తం ఒకటే పాలసీ ఉండాలి. వన్ నేషన్.. వన్ రేషన్ అంటారు. వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్మెంట్ ఎందుకు ఉండదు? పంజాబ్లో కొనుగోలు చేస్తారు.. తెలంగాణలో వడ్లు ఎందుకు కొనరని పంచాయితీ పెట్టాం. రైతులు నష్టపోకూడదని, గతేడాది నవంబర్ 12న అన్ని జిల్లాల కేంద్రాల్లో ధర్నాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం. లక్షలాది మంది రైతుల సమస్య కాబట్టీ నవంబర్ 18న సీఎం, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందిరాపార్కు వద్ద నిరసన తెలిపారు. మేం డిమాండ్ చేసిన ప్రతి సారీ... రాష్ట్రానికి సంబంధం లేదని, చివరి గింజ వరకు కొనిపించే బాధ్యత మాదని ఇక్కడి భాజపా నేతలు చెప్పుకొచ్చారు. కానీ, రైతులు మా మాట విని ఈ ఏడాది యాసంగిలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి వేయలేదు. 30 నుంచి 35 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇప్పుడు ఆ పంటలు కోతకొచ్చాయి. కేంద్రం కొనుగోలు చేయమంటోంది. ఎవరు కొనుగోలు చేయాలి?’’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
కేంద్రం తీరుపై గ్రామస్థాయి నుంచి పోరాటం...
‘‘కేంద్ర ప్రభుత్వం తీరుపై గ్రామస్థాయి నుంచి పోరాటం చేయాలని నిర్ణయించాం. ఈ నెల 4న తెరాస ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6న ముంబయి, నాగ్పూర్, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకో, 7న హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో వేలాది మంది రైతులు, కార్యకర్తలతో నిరసన చేపడతాం. 8న రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ప్రతి రైతు తన ఇంటి మీద నల్లజెండా ఎగురవేయాలి. ర్యాలీలు నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసన తెలపాలి. 11న దిల్లీలో తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరసన తెలుపుతారు. పార్లమెంట్లో తెరాస ఎంపీలు గళమెత్తుతారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నా’’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం