KTR: అత్యంత వేగంగా అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులు: కేటీఆర్‌

నగరంలోని ఐమాక్స్‌ సమీపంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని డిసెంబర్‌ నెలాఖరు నాటికి ప్రతిష్ఠిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రూ.150కోట్లతో

Published : 13 Apr 2022 15:01 IST

హైదరాబాద్‌: నగరంలోని ఐమాక్స్‌ సమీపంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని డిసెంబర్‌ నెలాఖరు నాటికి ప్రతిష్ఠిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రూ.150కోట్లతో చేపట్టిన విగ్రహ, ప్రాంగణ నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయని చెప్పారు. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ హుస్సేన్‌సాగర్‌ తీరాన సచివాలయం సమీపంలో విగ్రహం ఏర్పాటువుతోందని చెప్పారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. అంబేడ్కర్‌ విగ్రహ స్థలంలో 11 ఎకరాల్లో మ్యూజియం, పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలు గర్వించేలా విగ్రహ నిర్మాణం ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని