Ponnam Prabhakar: కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు: పొన్నం ప్రభాకర్‌

భారాస అధినేత కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.

Published : 01 Apr 2024 16:38 IST

హైదరాబాద్: భారాస అధినేత కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. కరవు, రాజకీయ పార్టీ, ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కరవు సాయం కోరాలన్నారు. కల్లాల్లోకి వడ్లు రాకముందే బండి సంజయ్‌ విమర్శలు చేస్తున్నారని.. వడ్లు కొననిరోజు, తూకంలో మోసాలు జరిగినప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. సంజయ్‌కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి కరవు నిధులు తేవాలన్నారు. కేంద్రం ఎంత ఇస్తే.. అంతే మొత్తంలో ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని పొన్నం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని