Satyavathi: కాంగ్రెస్ ఎస్టీ డిక్లరేషన్ పూర్తిగా కుట్ర పూరితమే: మంత్రి సత్యవతి రాథోడ్‌

కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయం చేస్తోందని భారాస నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న ఎస్టీ డిక్లరేషన్ పూర్తిగా కుట్ర పూరితమేనని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.

Published : 27 Aug 2023 15:03 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయం చేస్తోందని భారాస నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్ పూర్తిగా కుట్ర పూరితమేనని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, ప్రభుత్వ విప్‌ ఎంఎస్ ప్రభాకర్‌తో కలిసి మంత్రి సత్యవతి మాట్లాడారు. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.

కాంగ్రెస్‌ కుట్రలను తెలంగాణ ఎస్సీ, ఎస్టీలు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశంలో ఎస్సీ, ఎస్టీల వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. మాయమాటలు చెబుతున్న కాంగ్రెస్, భాజపాకి డిపాజిట్‌ రాకుండా ఓడించాలన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ చెత్తకుండీలో వేయడానికి పనికి వస్తుందని ఎంపీ కవిత ఎద్దేవా చేశారు. ఇలాంటి డిక్లరేషన్‌ చేసి అబాసుపాలు కావద్దన్నారు. డిక్లరేషన్ పేరిట మోసపూరిత హామీలు ఇవ్వడం మల్లికార్జున ఖర్గేకు తగదని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అదోక డమ్మీ డిక్లరేషన్‌ అని అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని