MP Arvind: రూ.18,500 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఖర్చు చేయలేదు: ఎంపీ అర్వింద్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకుని అరెస్టు చేయడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకుని అరెస్టు చేయడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఎంపీ అర్వింద్.. ఆయన్ను ఎందుకు అరెస్టు చేశారో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగితే.. తెలంగాణలో రెండు పడక గదుల ఇళ్ల పరిస్థితి ఏంటని అర్వింద్ ప్రశ్నించారు. గృహనిర్మాణ శాఖలో 1,821 మందికి 500 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారన్నారు. ఇంత తక్కువ స్థాయిలో సిబ్బంది ఉంటే ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించేది ఎవరు? నిర్మాణాలు ఎలా పూర్తవుతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇళ్ల నిర్మాణాలకు బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు చూపించారు.. కానీ, రూ.18,500 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఖర్చు చేయలేదని ఎంపీ అర్వింద్ ఆరోపించారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. వర్షంలో రోడ్డుపైనే బైఠాయింపు
మా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం: నల్లు ఇంద్రసేనారెడ్డి
‘‘రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్తున్నట్లు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చాం. అనుమతి తీసుకున్నాక కూడా బాటసింగారానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. భాజపా నాయకులను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ సమాజం చూస్తోంది. భాజపా అంటేనే కేసీఆర్ భయపడుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ మోసాలను ఇక ప్రజలు నమ్మరు. అరెస్టులు, అడ్డంకులతో భాజపా ఎదుగుదలను ఆపలేరు. మా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం’’ అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!