AP News: ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పవన్‌ నిర్ణయిస్తారు: ఎంపీ బాలశౌరి

పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆదివారం జనసేనలో చేరుతున్నట్టు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.

Updated : 03 Feb 2024 21:23 IST

గుంటూరు: పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆదివారం జనసేనలో చేరుతున్నట్టు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ...పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తనతో పాటు జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పవన్‌ నిర్ణయిస్తారని చెప్పారు.

‘‘2004లో వైఎస్‌ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చా. గత ఎన్నికల్లో వైకాపా తరఫున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి గెలిచా. బందరు పోర్టుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కేంద్రం నిధులు, సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ తీసుకొచ్చాం. పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లుగా అనుకున్నంతగా జరగలేదు. పోలవరం, స్టీల్‌ప్లాంట్‌పై పవన్‌తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నా. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తా’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని