Vijayawada: అలాంటి వారికి టికెట్లిస్తే సహకరించను.. తెదేపా పూర్తిగా ప్రక్షాళన కావాలనే..: ఎంపీ కేశినేని
తన సోదరుడు కేశినేని శివనాథ్కు ఎంపీ టికెటిస్తే సహకరించబోనని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) స్పష్టం చేశారు.
నందిగామ, న్యూస్టుడే: తన సోదరుడు కేశినేని శివనాథ్కు ఎంపీ టికెటిస్తే సహకరించబోనని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) స్పష్టం చేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు, ముగ్గురికి టికెట్లిచ్చినా మద్దతు ఇవ్వబోనని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలో పని చేసేందుకు, పోటీ చేసేందుకు అవకాశం ఉందని, క్రిమినల్స్, ల్యాండ్, సెక్స్ మాఫియాలకు టికెట్లిస్తే సహకరించబోనని చెప్పారు. తెదేపా పూర్తిగా ప్రక్షాళన కావాలనే ఉద్దేశంతోనే తానున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గంలో కేశినేని శివనాథ్ చురుగ్గా పని చేస్తున్నారని, ఎంపీ నాని లేరనే విషయాన్ని ప్రస్తావించగా... చురుగ్గా ఉంటే మంచిదేగా అని వ్యాఖ్యానించారు. ఈ సారి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా? అని అడగ్గా.. ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్న వేశారు. తన సేవలు ఎక్కడ అవసరమో అక్కడ అధిష్ఠానం వాడుకుంటుందని చెప్పారు. ఎంపీ కాకపోయినా టాటా ట్రస్టు లాంటివి మరో 100 తీసుకొచ్చి ప్రజా సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్