Munugode bypoll: మునుగోడు బీఎస్పీ అభ్యర్థిని ప్రకటించిన ప్రవీణ్‌ కుమార్‌

మునుగోడు ఉప ఎన్నిక(Munugode bypoll)కు బహుజన్‌ సమాజ్‌ పార్టీ(BSP) తన అభ్యర్థిని ఖరారు చేసింది. 

Updated : 08 Oct 2022 17:15 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక(Munugode bypoll)కు బహుజన్‌ సమాజ్‌ పార్టీ(BSP) తమ అభ్యర్థిగా ఆందోజు శంకరాచారిని  ఖరారు చేసింది.  ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అనుమతి ఇచ్చినట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

నిన్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని తెరాస అభ్యర్థిగా ప్రకటించింది. . మునుగోడు టికెట్‌ కోసం పార్టీలోని సీనియర్‌ నేతలు ప్రయత్నించగా.. సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీ అధిష్ఠానం కూసుకుంట్లవైపు మొగ్గు చూపింది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించగా.. ఇవాళ భాజపా అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికకు నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి 6న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని