Jignesh Mevani: పీఎంవో కుట్రలో భాగంగానే నా అరెస్టు : జిగ్నేశ్ మేవాణీ
వచ్చే ఎన్నికల్లో తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే అస్సాం ప్రభుత్వం, పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాణీ మండిపడ్డారు.
ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ గుజరాత్ ఎమ్మెల్యే
దిల్లీ: వచ్చే ఎన్నికల్లో తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే అస్సాం ప్రభుత్వం, పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాణీ మండిపడ్డారు. ప్రణాళిక ప్రకారమే తనను అరెస్టు చేశారన్న ఆయన.. ఈ కుట్రకు ప్రధానమంత్రి కార్యాలయమే రూపకల్పన చేసిందని ఆరోపించారు. బెయిల్పై విడుదలైన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన జిగ్నేశ్, ప్రధాని మోదీపైనా ఆరోపణలు గుప్పించారు.
‘ఓ మహిళను అడ్డం పెట్టుకొని తనపై తప్పుడు కేసు బనాయించారు. ఇది 56 అంగుళాల వ్యక్తి (మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ) జరిపిన పిరికిపంద చర్య. కుట్రలో భాగంగానే అస్సాం పోలీసులు నన్ను అరెస్టు చేశారు. ఈ కుట్రను ప్రధాని కార్యాలయమే రూపొందించింది. గుజరాత్లో మరికొన్ని నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను నాశనం చేసేందుకే ఈ ప్రయత్నం’ అని ఆయన ఆరోపించారు. ఇక 22 పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారంతోపాటు ఇటీవల ముంద్రాపోర్టులో సీజ్ చేసిన వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాల సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని జిగ్నేశ్ మేవాణీ డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా జూన్ 1న బంద్ పాటిస్తామన్నారు.
ఇదిలాఉంటే, నేరపూరిత కుట్ర, వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం, శాంతికి భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం వంటి అభియోగాలపై జిగ్నేశ్ మేవాణీపై అస్సాంలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి జిగ్నేశ్ మేవాణీని అస్సాం పోలీసులు గుజరాత్లో అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.