Nara Lokesh: లోకేశ్ చేతిలో మైక్ లాక్కునేందుకు పోలీసుల యత్నం.. పాదయాత్రలో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లాలో కొనసాగుతోన్న నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో లోకేశ్ పోలీసులపై ధ్వజమెత్తారు.
చిత్తూరు: నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా ఎన్ఆర్పేట ఎన్టీఆర్ కూడలిలో సభ నిర్వహణకు అనుమతి లేదంటూ లోకేశ్ను పోలీసులు అడ్డుకున్నారు. జీవో-1 ప్రకారం రోడ్లపై సమావేశానికి అనుమతి లేదని చెప్పడంతో తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతరం ఎన్టీఆర్ కూడలిలోనే తనను కలవడానికి వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి లోకేశ్ మాట్లాడారు. ‘సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ పెట్టాలి. తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకోవాలా?’ అని పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో లోకేశ్ చేతిలో మైకు లాక్కోవడానికి పోలీసులు యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. లోకేశ్ పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతున్నారని, నిబంధనల పేరుతో వేధిస్తున్నారని తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.