Nara Lokesh: అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు: నారా లోకేశ్‌

వైకాపా హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు.

Published : 18 Mar 2024 10:52 IST

మంగళగిరి: వైకాపా హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. మంగళగిరి ఎల్‌ఈపీఎల్‌ అపార్టుమెంట్‌ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు చేపడతామన్నారు. మంగళగిరిలోని స్వర్ణకారుల కోసం ప్రత్యేక సెజ్‌ తీసుకొస్తామని తెలిపారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు తరలివచ్చిన ప్రతిఒక్కరికీ తెదేపా అధినేత చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సమష్టిగా ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పం మరింత బలపడిందని చెప్పారు. కలిసికట్టుగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేడు పదో తరగతి పరీక్షల ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు చంద్రబాబు, లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని