₹35వేల కోట్లను వెంటనే విడుదల చేయాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 12 మంది విపక్ష నేతలు లేఖ రాశారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను విపక్ష నేతలు సూచించారు.
ప్రధాని మోదీకి 12మంది విపక్షనేతల లేఖ
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 12 మంది విపక్ష నేతలు లేఖ రాశారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను విపక్ష నేతలు సూచించారు. మోదీకి లేఖ రాసిన నేతల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, హేమంత్ సోరెన్ (జేఎంఎం), ఫరూక్ అబ్దుల్లా (జేకేపీఏ), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), డి.రాజా (సీపీఐ), సీతారాం ఏచూరి (సీపీఎం) తదితరులు ఉన్నారు. బడ్జెట్లో వ్యాక్సినేషన్కు కేటాయించిన ₹35 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని విపక్ష నేతలు లేఖలో కోరారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని లేఖలో విపక్ష నేతలు పేర్కొన్నారు.
విపక్ష నేతలు రాసిన లేఖలో ప్రధానాంశాలు..
* దేశీయంగా, అంతర్జాతీయంగా అవకాశాలున్న ప్రతి చోటు నుంచి వ్యాక్సిన్ సేకరించాలి.
* ఉచితంగా యూనివర్సల్ మాస్ వ్యాక్సిన్ క్యాంపెయిన్ చేపట్టాలి.
* దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలి.
* బడ్జెట్లో కేటాయించిన రూ.35కోట్లు వెంటనే విడుదల చేయాలి.
* సెంట్రల్ విస్టా ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలి.
* లెక్కలోకి రాని ప్రైవేటు ట్రస్ట్ ఫండ్ను పీఎం కేర్ ద్వారా వ్యాక్సిన్, ఆక్సిజన్, ఔషధాల కొనుగోలుకు ఉపయోగించాలి.
* నిరుద్యోగులకు నెలకు రూ.6వేలు భృతి చెల్లించాలి.
* పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలు అందించాలి.
* కొవిడ్ పరిస్థితుల్లో రైతులను ఆదుకోలేకపోయిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.