Pawan Kalyan: రాజమహేంద్రవరం విమానాశ్రయంలో జనసేనానికి ఘన స్వాగతం

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి

Updated : 20 Feb 2022 13:33 IST

రాజమహేంద్రవరం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి సభకు హాజరయ్యేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్‌.. రావులపాలెం, సిద్ధాంతం, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుకుంటారు. సభ ముగిసిన అనంతరం పవన్‌.. నరసాపురం నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని