Devendra Fadnavis: లోక్సభ ఎన్నికలపై దేవేంద్ర ఫడణవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేయాలని ప్రజలు నిశ్చయంతో ఉన్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు.
పుణె: వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి భాజపా సీనియర్ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఓటు వేయాలని ప్రజలు నిశ్చయంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో భాజపాకు కొన్ని సీట్లు తగ్గుతాయని.. విపక్షాలు మెరుగైన ఫలితాలు సాధిస్తాయంటూ ఓ సర్వే పేర్కొనడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఫడణవీస్ స్పందించారు. ‘‘ప్రస్తుతం కేవలం మోదీ హవా మాత్రమే ఉందన్నారు. మోదీజీకే ఓటు వేయాలని ప్రజలు నిశ్చియించుకున్నారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ సీట్లకు గాను మేం 40 లోక్సభ సీట్లు గెలుచుకుంటాం’’ అని ఫడణవీస్ విశ్వాసం వ్యక్తం చేశారు.
వైకాపా నుంచి పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైంది:
మరోవైపు, సోమవారం ఆయన ముంబయిలోని తన అధికారిక నివాసంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పుణె పర్యటనకు బయల్దేరి వెళ్లారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్