Congress MLA: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ అరెస్టు ఆప్-కాంగ్రెస్ల మధ్య బంధాన్ని ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చండీగఢ్: డ్రగ్స్ అక్రమ రవాణా, మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టిన పంజాబ్ పోలీసులు.. సుఖ్పాల్ను అదుపులోకి తీసుకున్నారు. 2015లో ఎన్డీపీఎస్ చట్టం కింద జలాదాబాద్, ఫజిల్కాలో సుఖ్పాల్పై కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయ డ్రగ్ ముఠాలకు సాయం చేయడంతో పాటు, వారికి ఆశ్రయం కల్పించి ఆర్థికంగా లబ్ధి పొందాడని పోలీసులు ఛార్జీషీట్లో పేర్కొన్నారు.
2014-20 మధ్య కాలంలో సుఖ్పాల్ ఆదాయానికి మించి ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ అరెస్టు ఆప్-కాంగ్రెస్ మధ్య సంబంధాలను మరింత దెబ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియా కూటమిలో ఇరు పార్టీలు భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అరెస్టు చర్చనీయాంశమైంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఆప్తో సీట్ల పంపకాన్ని పంజాబ్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Lok Sabha: మరో ఇద్దరు భాజపా ఎంపీల రాజీనామాలు ఆమోదం
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భాజపా ఎంపీలు తమ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. -
Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) నేడు ‘ప్రజాదర్బార్’ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజా దర్బార్ జరిగిన తీరుపై సీఎం ఆసక్తికర ట్వీట్ చేశారు. -
ChandraBabu: ప్రతిపక్షాల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోంది: ఈసీకి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ.. ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు (ChandraBabu) అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆయన లేఖ రాశారు. -
Revanth Reddy: దిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. -
BJP: కొత్త సీఎంలపై ఇంకా వీడని ఉత్కంఠ.. కమిటీలు వేసిన భాజపా
మూడు రాష్ట్రాల్లో విజయం సాధించి ఐదురోజులైనా.. భాజపా(BJP) ఇంకా ముఖ్యమంత్రులను ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఈ ఎంపిక ప్రక్రియను కమలం పార్టీ ముమ్మరం చేసింది. -
ChandraBabu: వైకాపా ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే 3 నెలల తర్వాత నేనిస్తా: చంద్రబాబు
తాను ఏ తప్పూ చేయకున్నా జైల్లో పెట్టి క్షోభకు గురి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగులో తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. -
TS Assembly: శాసనసభ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్తో రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. -
Pawan Kalyan: కేసీఆర్కు గాయమైందని తెలిసి బాధపడ్డా: పవన్కల్యాణ్
భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR)కు గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. -
Chandrababu: నా పర్యటన ఖరారైతే తప్ప జగన్లో కదలిక రాలేదు: చంద్రబాబు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటనకు వెళ్తున్నానని.. అందుకే ఇప్పుడు సీఎం జగన్ హడావుడిగా బయల్దేరారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
Daggubati Purandeswari: ఏపీ మంత్రులెవరూ రైతులను పరామర్శించిన దాఖలాల్లేవు: పురందేశ్వరి
తుపాను కారణంగా రాష్ట్రంలో పంటలు బాగా దెబ్బతిన్నాయని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. -
Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలి: అధికారులకు సీఎం ఆదేశం
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు గాయమైన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. -
Anam Venkata Ramana Reddy: కుంభకోణం జరగలేదని తితిదే ఛైర్మన్ ప్రమాణం చేయగలరా?: ఆనం
ఆంధ్రప్రదేశ్లో ₹వేల కోట్ల అభివృద్ధి హక్కు పత్రాల(టీడీఆర్ బాండ్లు) కుంభకోణం జరిగిందని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ఆరోపించారు. -
Kavitha: అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు: ఎమ్మెల్సీ కవిత
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్యంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పందించారు. -
ఏళ్లుగా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వచ్చారా..?
గుంటూరు జిల్లా కాకుమానులో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు నిరసన సెగ తగిలింది. -
వైకాపా దుష్టపాలన ఇంకా మూడు నెలలే
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా-జనసేన పొత్తు తప్పనిసరి. అందుకే మా పొత్తును గెలిపించండి. మళ్లీ వైకాపా వైపు చూశారా? మీ భవిష్యత్ను మీరు నాశనం చేసుకున్నట్లే. -
అసమర్థ ప్రభుత్వమిది.. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శ
జగన్ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రం అన్ని రకాలుగానూ నష్టపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. -
సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి: ఎమ్మెల్సీ కె.కవిత
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని తెబొగకాసం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కె.కవిత పిలుపునిచ్చారు. -
మమతపై కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. -
నెహ్రూను అవమానిస్తే పటేల్ను దూషించినట్టే
‘‘భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ ఒకే నాణేనికి రెండు వైపుల వంటివారు. -
న్యాయస్థానాలు, హరిత ట్రైబ్యునల్ ఆదేశాలంటే లెక్కలేదా?
రాష్ట్రంలో ఇసుక, మట్టి, కొండలు, గుట్టలను సీఎం జగన్, వైకాపా నేతలు కొల్లగొడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. -
పాఠశాలల విలీనంతో విద్యా వ్యవస్థలో సమస్యలు
మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) మార్గదర్శకాలు విద్యా వ్యవస్థలో అనేక సమస్యలకు కారణమవుతాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.


తాజా వార్తలు (Latest News)
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!