Amit Shah: ఇటాలియన్ కళ్లద్దాలు తీసి అభివృద్ధిని చూడండి.. రాహుల్ గాంధీపై అమిత్ షా విమర్శలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం విమర్శలు గుప్పించారు. రాహుల్ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి.. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలని ఎద్దేవా చేశారు. అరుణాచల్ప్రదేశ్లోని..
ఇటానగర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం విమర్శలు గుప్పించారు. రాహుల్ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి.. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలని ఎద్దేవా చేశారు. అరుణాచల్ప్రదేశ్లోని నమ్సాయి జిల్లాలో రూ.వెయ్యి కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి ఆదివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ‘ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఏం జరిగిందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే.. వారు కళ్లు మూసుకుని, మెలకువగా ఉన్నారు. రాహుల్ గాంధీ.. తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి ప్రధాని మోదీ, స్థానిక సీఎం పెమా ఖండూ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలి’ అని వ్యాఖ్యానించారు.
‘అరుణాచల్లో గత ఎనిమిదేళ్లలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు, శాంతి భద్రతల బలోపేతానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ, సీఎం పెమా ఖండూ చేసిన పనులు.. గత 50 ఏళ్లలో జరగలేదు’ అని అన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో ఉన్న అమిత్ షా.. ఈరోజు తెల్లవారుజామున ఇక్కడి గోల్డెన్ పగోడాను సందర్శించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, సీఎం పెమా ఖండూ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి నేడు రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు, అభివృద్ధిని సమీక్షించనున్నారు. ఆర్మీ, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్, అస్సాం రైఫిల్స్ తదితర సాయుధ బలగాల సిబ్బందితో భేటీ కానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం