Nara Lokesh: జగన్కు తెలిసే వివేకా హత్య!: నారా లోకేశ్
సీఎం జగన్కు తెలిసే మాజీ మంత్రి వివేకా హత్య జరిగిందనే విషయం సీబీఐ విచారణలో నిర్ధారణ అవుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు.
విశాఖ: సీఎం జగన్కు తెలిసే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగిందనే విషయం సీబీఐ విచారణలో నిర్ధారణ అవుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. హత్య చేయించిందెవరో వివేకా కుమార్తె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఉందని చెప్పారు. ఎంపీ అవినాష్రెడ్డి సూత్రధారి అని సాక్షులు వాంగ్మూలాల్లో చెప్పారని లోకేశ్ తెలిపారు. హత్య కేసులో సూత్రధారులు రోడ్లపై దర్జాగా తిరుగుతుంటే ప్రజల కోసం పోరాడుతున్న తెదేపా నాయకులపై జగన్ సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. తనపై అసత్యాలు ప్రచురించారంటూ ‘సాక్షి’ దినపత్రికపై లోకేశ్ విశాఖ కోర్టులో రూ.75కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి విశాఖ కోర్టుకు ఆయన మరోసారి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
వివేకా హత్య కేసు నిందితులను జగన్ సర్కార్ వదిలేసిందని లోకేశ్ ఆరోపించారు. బాబాయిని చంపిన హంతకుల్ని పట్టుకోవాలనే తపన జగన్లో అసలు లేదని విమర్శించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై అనవసర ఆరోపణలు చేశారని.. అధికారంలోకి వచ్చాక సీబీఐ దర్యాప్తు కూడా కోరలేదని గుర్తు చేశారు. మరోవైపు దొంగ రాతలు రాస్తామంటే కుదరదని లోకేశ్ అన్నారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేకపోతున్నారని..ఉన్నవాళ్లను ఇబ్బంది పెడుతుంటే కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయని లోకేశ్ ప్రశ్నించారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని వాళ్లు రాజధాని నిర్మిస్తారా అని నిలదీశారు. విశాఖకు ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా అని ధ్వజమెత్తారు. సీబీఐ అధికారులపై కేసులు పెట్టడం ఇప్పుడే చూస్తున్నామని లోకేశ్ ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం