ఆయనకు కేబినెట్ స్పెల్లింగ్ కూడా రాదు..
కేబినెట్ పదానికి స్పెల్లింగ్ కూడా చెప్పలేని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్.. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను విమర్శిస్తున్నారంటూ కేంద్రమంత్రి అశ్వినీ చౌబే ఎద్దేవా చేశారు.
పట్నా: కేబినెట్ పదానికి స్పెల్లింగ్ కూడా చెప్పలేని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్.. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను విమర్శిస్తున్నారంటూ కేంద్రమంత్రి అశ్వినీ చౌబే ఎద్దేవా చేశారు. నితీశ్ నాయకత్వంలో అభివృద్ధి జరగలేదని, నిరుద్యోగం తాండవిస్తోందని..తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ తేజస్వి బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన 10 లక్షల ఉద్యోగాల హామీని మొదటి నుంచి అధికార కూటమి విమర్శిస్తూనే ఉంది.
‘సమస్యను అర్థం చేసుకోలేని ఒక వ్యక్తి..పదో తరగతి కూడా పాస్కాని ఒక వ్యక్తి..ఇంజనీరింగ్ పట్టభద్రుడైన నితీశ్ కుమార్ను విమర్శిస్తున్నారు. ఆయనకు కనీసం కేబినెట్ స్పెల్లింగ్ కూడా రాయడం రాదు. ఆయన తండ్రి లక్ష ఉద్యోగాలు కల్పిస్తానని మొదటి కేబినెట్ సమావేశంలో హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఉద్యోగ దరఖాస్తులు అక్కడ చెత్త బుట్టలోనే ఉన్నాయి. ఉద్యోగాల పేరు చెప్పి డబ్బులు మాత్రం వసూలు చేశారు. ఆ కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి పెద్ద పెద్ద తప్పుడు హామీలు మాత్రమే ఇస్తుంది. వాటి పట్ల ప్రజలు అప్రమత్తతతో ఉండాలి’ అని చౌబే మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా, తేజస్వీ యాదవ్ను ఆటవిక రాజ్యం యువరాజ్తో పోలుస్తూ ఇటీవల ప్రధాని మోదీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కిడ్నాపులపై వారికి కాపీరైట్ ఉందని ఆరోపిస్తూ, జాగ్రత్తగా ఉండమని ప్రజలకు సూచించారు. చీకటి నుంచి బిహార్ను బయటపడేసిన ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవడానికి మరోసారి అవకాశం వచ్చిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి