AP News: సభ ప్రారంభమే కాలేదు.. అప్పుడే వైకాపాకు దడ..: సీఎం రమేశ్‌

కొత్తగా అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చామని భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు.

Updated : 28 Dec 2021 13:53 IST

విజయవాడ: వైకాపా ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చామని.. రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు వాళ్లు చేసిందేమీ లేదని భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించనున్న ప్రజాగ్రహ సభలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తామని చెప్పారు. విజయవాడలో సీఎం రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. సభ ప్రారంభమే కాలేదని.. అప్పుడే వైకాపాకు దడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో కక్ష సాధింపులు తప్ప ప్రజలకు ఏమీ చేయడం లేదని కొందరు అధికారులే చెబుతున్నారన్నారు. రాష్ట్ర భాజపాపై తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు సీఎం రమేశ్‌ వద్ద ప్రస్తావించగా.. తెదేపా ప్రతిపక్ష పాత్ర పోషించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజాగ్రహ సభ ఆరంభం మాత్రమేనని చెప్పారు. రాజధానిగా అమరావతే కొనసాగుతుందని.. ఈ విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నానని సీఎం రమేశ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని