TS News: హుజూరాబాద్‌ ఓటమి దృష్టి మరల్చేందుకే కేసీఆర్‌ కొత్త నాటకం: కిషన్‌రెడ్డి 

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ కేసీఆర్‌ కొత్త

Updated : 22 Nov 2021 16:41 IST

హైదరాబాద్‌: హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ కేసీఆర్‌ కొత్త నాటకం మొదలుపెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారన్న కిషన్‌రెడ్డి అబద్ధాల భవనం మీదే కేసీఆర్‌ కుటుంబం రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న మేరకు ప్రతి గింజా కొంటామని ఆయన చెప్పారు.

ధనిక రాష్ట్రం మిగులు రాష్ట్రం అని కేసీఆర్‌ చెబుతున్నా కాంట్రాక్టర్లకు కూడా డబ్బులివ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని కిషన్‌రెడ్డి తెలిపారు. పంజాబ్‌ రైతులకు పరిహారం ఇస్తామనడంలో తప్పులేదన్న ఆయన మరి రాష్ట్ర రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని