ఇద్దరు సీఎంలు కుమ్మక్కయ్యారు: కాలవ

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఇద్దరు సీఎంలు జగన్‌, కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసునన్నారు. 

Updated : 15 Jul 2021 20:19 IST

మంగళగిరి: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఇద్దరు సీఎంలు జగన్‌, కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసునన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో కాలవ మీడియాతో మాట్లాడారు. జలవివాదంపై అనవసర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించడం లేదనటం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి సీఎం జగనా? లేక చంద్రబాబా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ఎందుకు బలమైన వాదనలు వినిపించలేదు? జలవివాదాలపై సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదు? లేఖలు రాస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా?అని ప్రశ్నించారు. జలవివాదంపై ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని