నీతీశ్ విధానాలతోనే అభివృద్ధికి బిహార్ దూరం: లాలూ
బిహార్ అభివృద్ధికి దూరంగా ఉండటానికి ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ విధానాలే కారణమంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ..
నీతి ఆయోగ్ సూచీలో బిహార్ అట్టడుగు స్థానంలో నిలవడంపై విమర్శలు
పట్నా: బిహార్ అభివృద్ధికి దూరంగా ఉండటానికి ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ విధానాలే కారణమంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. నీతి ఆయోగ్ ప్రకటించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సూచీ(ఎస్డీజీ) 2020-21లో బిహార్ అట్టడుగున నిలిచిన నేపథ్యంలో నీతీశ్పై లాలూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన చాలా ఆరోగ్య కేంద్రాలను నీతీశ్ మూయించారని విమర్శించారు. పాఠశాల భవానాలను సైతం నిరుపయోగంగా మార్చారని దుయ్యబట్టారు. నీతి ఆయోగ్ రిపోర్టులో బిహార్ ఆఖరి స్థానంలో నిలవడానికి ఇలాంటి చర్యలే కారణమన్నారు. నీతీశ్పై ప్రతిపక్ష నేత తేజస్వి ప్రసాద్ యాదవ్ సైతం మండిపడ్డారు. అభివృద్ధిలో బిహార్ ఆఖరి స్థానంలో నిలవడం వరుసగా ఇది మూడోసారంటూ ధ్వజమెత్తారు. నీతీశ్ 16 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో నీతి ఆయోగ్ రిపోర్టు తెలియజేస్తోందంటూ ఎద్దేవా చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి విమర్శలపై జనతాదళ్(జేడీయూ)నేత, అధికార ప్రతినిధి రాజీవ్ రతన్ స్పందించారు. ‘‘లాలూ ప్రస్తుతం నీతి ఆయోగ్ రిపోర్టు గురించి మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశ ప్రజలంతా బిహార్లో జరిగిన నేరాల గురించే మాట్లాడుకునేవారు. తాజా నివేదికను మేము అంగీకరిస్తున్నాం. బిహార్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నట్లయితే పరిస్థితి మరోలా ఉండేది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలే కారణం’’ అని పేర్కొన్నారు. రాజీవ్ రతన్ వ్యాఖ్యలను ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ ఖండించారు. బిహార్ కంటే ఝార్ఖండ్ ర్యాంకు మెరుగ్గా ఉందని గుర్తు చేశారు. మరోవైపు.. లాలూ వ్యర్థ సూచనలు ఇస్తున్నారంటూ భాజపా అధికార ప్రతినిధి అజిత్ చౌదరి విమర్శించారు.
రాష్ట్రాలు సాధించిన సుస్థిరమైన అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ గురువారం విడుదల చేసిన నివేదికలో కేరళ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, బిహార్ ఆఖరి స్థానంలో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట