TRS-CPI: ఖమ్మం జిల్లాలో తెరాస, సీపీఐ వర్గాల మధ్య ఘర్షణ
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కామంచికల్లులో ఇవాళ ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
రఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కామంచికల్లులో ఇవాళ ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలోని తెరాస, సీపీఐ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఒక వర్గంపై మరో వర్గం దాడులకు పాల్పడ్డాయి.
గురువారం రాత్రి ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి సమక్షంలో సీపీఐకి చెందిన సర్పంచ్ వెంకటరమణ, ఉప సర్పంచ్ ప్రభాకర్, మరో వార్డు సభ్యుడు, పలు కుటుంబాలకు చెందిన వారు తెరాసలో చేరారు. ఈ నేపథ్యంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బెటాలియన్ను తీసుకొచ్చి గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ బస్వారెడ్డి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.