Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం!
ఇవే తనకు చివరి ఎన్నికలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధ రామయ్య అన్నారు. అలాగని తాను రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించబోనన్నారు.
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య(siddaramaiah) సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరివన్న ఆయన.. రాజకీయాల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టంచేశారు. మొత్తం 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వంలో హెచ్డీ కుమార స్వామి సీఎంగా ఉండగా.. ఆ తర్వాత ఈ కూటమిలో ఏర్పడిన విభేదాల కారణంగా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ తర్వాత యడియూరప్ప సారథ్యంలో భాజపా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగా.. ఆ తర్వాత ఆయన స్థానంలో నూతన సీఎంగా బసవరాజ్ బొమ్మైను భాజపా అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే.
మరోవైపు, కర్ణాటక సీఎం బొమ్మై, ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య మధ్య మాటల వార్ నడుస్తోంది. గత బడ్జెట్లో ప్రకటించిన పనుల్లో కేవలం 10శాతం మాత్రమే అమలు చేశారని.. రాష్ట్ర అప్పులు రూ.3లక్షల కోట్ల మార్కును దాటేసిందని సిద్ధరామయ్య ఆరోపించగా.. దీనిపై సీఎం బొమ్మై దీటుగా స్పందించారు. గతంలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. కర్ణాటక చరిత్రలోనే ఆయన గరిష్ఠంగా అప్పులు చేశారంటూ విరుచుకుపడ్డారు. అయినా.. బడ్జెట్ అమలుకు సంబంధించిన వివరాలను వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అందజేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం