Crime News: చిరుత మాంసంతో విందు.. నిందితుల అరెస్టు

చిరుతను వేటాడి ఆ మాంసంతో ముగ్గురు దుండగులు విందు చేసుకున్నారు. అంతేకాదు.. 

Updated : 13 Mar 2022 11:12 IST

శిలిగుడి: చిరుతను వేటాడి ఆ మాంసంతో ముగ్గురు దుండగులు విందు చేసుకున్నారు. అంతేకాదు.. ఆ చిరుత చర్మాన్ని, గోళ్లను అక్రమ రవాణా చేసేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని శిలిగుడిలో వెలుగులోకి వచ్చింది. చిరుతను వేటాడిన ఫొటో నిందితులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడం వల్ల ఆ ఘటన అధికారుల దృష్టికి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు 15 రోజుల తర్వాత నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు. నిందితులు ముకేశ్‌ కేకెట్టా, పితలుష్‌ కేర్‌కెట్టాలను అరెస్ట్‌ చేసి.. వారి నుంచి చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అయితే నిందితుల వద్ద చిరుత గోళ్లు లభించలేదని.. దీనిపై మరింత దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని