Chess: భారత 72వ గ్రాండ్మాస్టర్ మిత్రాబ్
సంకల్ప్ గుప్తా గ్రాండ్మాస్టర్ అయిన రెండు రోజుల వ్యవధిలోనే మరో భారత ఆటగాడు మిత్రాబ్ గుహ జీఎం హోదా దక్కించుకున్నాడు. సెర్బియాలో జరుగుతున్న మిక్స్ 220 టోర్నమెంట్లో
చెన్నై: సంకల్ప్ గుప్తా గ్రాండ్మాస్టర్ అయిన రెండు రోజుల వ్యవధిలోనే మరో భారత ఆటగాడు మిత్రాబ్ గుహ జీఎం హోదా దక్కించుకున్నాడు. సెర్బియాలో జరుగుతున్న మిక్స్ 220 టోర్నమెంట్లో అతడు చివరి జీఎం నార్మ్ సంపాదించి 72వ భారత గ్రాండ్మాస్టర్గా అవతరించాడు. 20 ఏళ్ల మిత్రాబ్.. ఇటీవలే బంగ్లాదేశ్లో జరిగిన షేక్ రసెల్ టోర్నీలో రెండో జీఎం నార్మ్ దక్కించుకున్నాడు. ‘‘రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు గ్రాండ్మాస్టర్లు! 100వ గ్రాండ్మాస్టర్ త్వరలోనే రాబోతున్నాడు. మిత్రాబ్కు శుభాకాంక్షలు’’ అని చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు