ఎంసీజీలో రహానెకు అరుదైన గౌరవం
టీమ్ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానెకు ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అరుదైన గౌరవం లభించింది. ఇటీవల జరిగిన బాక్సింగ్డే టెస్టులో అతడు శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే...
మెల్బోర్న్: టీమ్ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానెకు ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అరుదైన గౌరవం లభించింది. ఇటీవల జరిగిన బాక్సింగ్డే టెస్టులో అతడు శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ మ్యాచ్ గెలవడమే కాకుండా అడిలైడ్ ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ క్రమంలోనే అతడు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికై ‘జానీ ముల్లగ్’ పతకం సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు. ఇది మాత్రమే కాకుండా ఎంసీజీ ప్రతిష్ఠాత్మకంగా గౌరవించే బోర్డులో రెండోసారి తన పేరును నమోదు చేసుకున్నాడు.
టీమ్ఇండియా ఈ విషయాన్ని తాజాగా ఇన్స్టాగ్రామ్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. 2014 బాక్సింగ్ డే టెస్టులో రహానె(147) తొలిసారి ఇదే మైదానంలో శతకంతో కదం తొక్కాడు. అప్పుడు మ్యాచ్ డ్రాగా ముగిసింది. తాజా సిరీస్లో రెండోసారి శతకం బాది క్లిష్ట సమయంలో భారత్ను గెలిపించాడు. దీంతో ఎంసీజీ నిర్వాహకులు రహానె పేరును రెండోసారి గౌరవ సూచికంగా ఆ బోర్డుపై లిఖించారు. ఆ వీడియోను టీమ్ఇండియా అభిమానులతో పంచుకుంది.
ఇక ఈ మ్యాచ్లో రహానె బ్యాట్స్మన్గానే కాకుండా కెప్టెన్గానూ ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమి, రోహిత్ శర్మ లాంటి కీలక ఆటగాళ్లు లేకున్నా జట్టును ముందుండి నడిపించాడు. తన వ్యూహాలు, నైపుణ్యాలతో ఆసీస్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో అందరి చేతా శెభాష్ అనిపించుకున్నాడు.
ఇవీ చదవండి..
ధోనీ, కోహ్లీ సరసన నిలిచా: జడేజా
అసలిది ఆసీస్ బ్యాటింగ్ లైనప్పేనా: సచిన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం