హార్దిక్ పాండ్య తండ్రి కాబోతున్నాడు కాబట్టి..
ఈసారి సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించే ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య...
అది అతడికి అదనపు శక్తినిస్తుంది : బ్రాడ్హాగ్
ఇంటర్నెట్డెస్క్: ఈసారి సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించే ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా’ నిలుస్తాడని ఆస్ట్రేలియా మాజీ లెగ్స్పిన్నర్ బ్రాడ్హాగ్ అన్నాడు. చాలా రోజుల నుంచి పాండ్య క్రికెట్కు దూరమయ్యాడని, అలాగే త్వరలో తండ్రి కాబోతున్నాడని చెప్పాడు. ఆ రెండు కారణాలతో ముంబయి ఆల్రౌండర్కు అదనపు శక్తి పొందుతాడని, తద్వారా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపిక అవుతాడని హాగ్ అభిప్రాయపడ్డాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అతడు ఐపీఎల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ జట్టే ఈసారి కూడా విజేతగా నిలుస్తుందని చెప్పాడు.
ముంబయి జట్టు తొలి నలుగురు మంచి ఆటగాళ్లు అని, తర్వాత వచ్చే ఆటగాళ్లు కూడా అత్యుత్తమ ఆల్రౌండర్లని చెప్పాడు. అలాగే వారికి అద్భుతమైన బౌలింగ్ విభాగం ఉందన్నాడు. ఇక డెత్ ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా లాంటి మేటి పేసర్లున్నారని గుర్తుచేశాడు. ముంబయి ఇండియన్స్ తర్వాత తన రెండో ఫేవరెట్ ఆర్సీబీ జట్టని, 12 సీజన్లలో అది ఇప్పటివరకూ టైటిల్ సాధించేదని పేర్కొన్నాడు. ఆ జట్టుకు మంచి ఆటగాళ్లున్నా ఎప్పుడూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారని వివరించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ ఆరోన్ ఫించ్ ఆ జట్టు టాప్ఆర్డర్లో చేరాడని, అతడు చాలా త్వరగా పరుగులు చేస్తాడన్నాడు. దాంతో తర్వాత బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాళ్లపై భారం తగ్గుతుందని వ్యాఖ్యానించాడు. అనంతరం ధోనీ గురించి మాట్లాడిన బ్రాడ్.. అతడో అద్భుతమైన ఆటగాడని, భయం లేకుండా ఆడతాడని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్లో అతడిని ఎవరూ రీప్లేస్ చేయలేరని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434