ధోనీ, కోహ్లీనే ఈ దశాబ్దపు సారథులు

‘ఐసీసీ టీమ్‌ ఆఫ్ ది డెకెడ్’ అవార్డుల్లో భారత ఆటగాళ్లదే హవా. ‌వన్డే, టీ20 ఫార్మాట్లకు ఎంఎస్ ధోనీ సారథిగా, టెస్టు జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ దశాబ్దపు అత్యుత్తమ టీ20, వన్డే, టెస్టు క్రికెట్ జట్లను ఆదివారం

Published : 28 Dec 2020 01:18 IST

అన్ని ఫార్మాట్ల జట్లను ప్రకటించిన ఐసీసీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఐసీసీ టీమ్‌ ఆఫ్ ది డెకెడ్’ అవార్డుల్లో భారత ఆటగాళ్లదే హవా. ‌వన్డే, టీ20 ఫార్మాట్లకు ఎంఎస్ ధోనీ సారథిగా, టెస్టు జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ దశాబ్దపు అత్యుత్తమ టీ20, వన్డే, టెస్టు క్రికెట్ జట్లను ఆదివారం ఐసీసీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. టీ20 జట్టులో ధోనీ, కోహ్లీతో పాటు ఓపెనర్‌ రోహిత్ శర్మ, పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అలాగే వన్డే ఫార్మాట్‌కు వెల్లడించిన జట్టులో ధోనీ, రోహిత్‌, కోహ్లీ చోటు సంపాదించారు. దశాబ్దపు టెస్టు జట్టులో భారత్‌ నుంచి కోహ్లీ, స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ ఉన్నారు.

మరోవైపు ఐసీసీ ప్రకటించిన మహిళల జట్టులో భారత్‌ నుంచి నలుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. టీ20 ఫార్మాట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్; వన్డే జట్టులో మిథాలీ రాజ్‌, జులన్ గోస్వామి చోటు సంపాదించారు. రెండు జట్లకు కెప్టెన్‌ ఆస్ట్రేలియా క్రికెటర్‌ మెగ్ లానింగ్.

మెన్స్‌ టీ20 జట్టు

రోహిత్‌ శర్మ, క్రిస్ గేల్‌, ఆరోన్‌ ఫించ్‌, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌, ఎంఎస్ ధోనీ (కెప్టెన్‌), పొలార్డ్‌, రషీద్ ఖాన్‌, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ

ఉమెన్స్ టీ20 జట్టు

అలెస్సా హీలి, సోఫిల్ డెవైన్‌, సుజీ బేట్స్‌, మెగ్ లానింగ్ (కెప్టెన్‌)‌, హర్మన్‌ప్రీత్ కౌర్‌, స్టాఫనీ టేలర్‌, డియాండ్ర డాటిన్‌, ఎలిసా పెర్రీ, అన్య స్రుబోస్లే, మెగాన్‌ స్కౌట్, పూనమ్ యాదవ్

మెన్స్ వన్డే జట్టు

రోహిత్‌ శర్మ, డేవిడ్ వార్నర్‌, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, షకిబ్‌ అల్ హసన్‌, ఎంఎస్ ధోనీ (కెప్టెన్‌), బెన్ స్టోక్స్‌, మిచెల్ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, లసిత్ మలింగ

ఉమెన్స్‌ వన్డే జట్టు

అలిస్సా హీలి, సుజీ బేట్స్‌, మిథాలీ రాజ్‌, మెగ్ లానింగ్‌ (కెప్టెన్‌), స్టాఫనీ టేలర్, సారా టేలర్‌, ఎలిసా పెర్రీ, డేన్‌ వాన్‌, మరిజన్నె కప్‌, జులన్ గోస్వామి, అనిసా మహ్మద్‌

మెన్స్‌ టెస్టు జట్టు

కుక్‌, డేవిడ్‌ వార్నర్‌, కేన్ విలియమ్సన్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్, కుమార సంగక్కర, బెన్‌ స్టోక్స్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, డేల్ స్టెయిన్‌, స్టువర్ట్ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌

ఇదీ చదవండి

రహానె శతకం..భారత్‌దే ఆధిపత్యం

కోహ్లీ కన్నా బుమ్రాకే ఎక్కువ పారితోషికం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని