సింధుకు సులువు.. సైనాకు కఠినం
థాయ్ల్యాండ్లో జనవరిలో జరుగుతున్న బ్యాడ్మింటన్ టోర్నీల్లో పీవీ సింధుకు సులువైన డ్రా లభించింది. మరో సీనియర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్కు కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. కొవిడ్-19 వల్ల పది నెలలు ఆగిపోయిన బ్యాడ్మింటన్ మళ్లీ మొదలవుతున్న సంగతి తెలిసిందే. మధ్యలో డెన్మార్క్ ఓపెన్, సార్లోర్లక్స్ ..
దిల్లీ: థాయ్లాండ్లో జనవరిలో జరుగనున్న బ్యాడ్మింటన్ టోర్నీల్లో పీవీ సింధుకు సులువైన డ్రా లభించింది. మరో సీనియర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్కు కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. కొవిడ్-19 వల్ల పది నెలలు ఆగిపోయిన బ్యాడ్మింటన్ మళ్లీ మొదలవుతున్న సంగతి తెలిసిందే. మధ్యలో డెన్మార్క్ ఓపెన్, సార్లోర్లక్స్ ఓపెనర్లు జరిగినా వీరిద్దరూ అందులో పాల్గొనలేదు.
బ్యాడ్మింటన్ ఆరంభం అవుతుండటంతో అందరి చూపూ థాయ్లాండ్లో జరుగుతున్న రెండు సూపర్ 1000 టోర్నీలపై పడింది. జనవరి 12-17 వరకు యోనెక్స్ థాయ్లాండ్ ఓపెన్, 19-24 వరకు టొయాటొ థాయ్లాండ్ ఓపెన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి ఓపెన్లో ఆరో సీడ్గా బరిలోకి దిగుతున్న సింధు తొలిపోరులో డెన్మార్క్ అమ్మాయి మియా బ్లిచ్ఫెల్ట్తో తలపడనుంది. సైనా తొలిరౌండ్లో నొజొమి ఒకుహర (జపాన్)తో పోటీపడనుంది. ఇక రెండో టోర్నీలో బుసానన్ ఒంగ్బమ్రంగ్ఫన్ (థాయ్)తో సింధు, రచనోక్ ఇంతానన్తో సైనా తలపడాల్సి వస్తోంది.
పురుషుల సింగిల్స్కు వస్తే మాజీ ప్రపంచ నంబర్వన్ కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, లక్ష్యసేన్ రెండు టోర్నీల్లో పాల్గొంటున్నారు. మొదట శ్రీకాంత్ తన సహచరుడైన సౌరభ్వర్మను ఎదుర్కోనుండటం గమనార్హం. లక్ష్యసేన్ ఇండోనేసియా షెసర్ హరెన్ రుస్తవిటొతో తలపడనున్నాడు. ఇక ప్రణీత్ స్థానిక ఆటగాడు కంటఫోన్ వాంగ్చరోన్తో ఆడనున్నాడు. మలేసియా షట్లర్ లీ జి జియాతో ప్రణయ్, జపాన్ ఆటగాడు కెంటా నిషిమోటోతో పారుపల్లి కశ్యప్, షెసర్ హరెన్తో సమీర్ వర్మ పోటీపడనున్నారు. రెండో టోర్నీలో సిత్తికోమ్ తమ్మసిన్తో శ్రీకాంత్, డారెన్ లియూతో ప్రణీత్, చౌ టీన్ చెన్తో లక్ష్యసేన్ తలపడనున్నారు.
ఇవీ చదవండి
రోహిత్ వచ్చేశాడు! మరి జట్టులో మార్పులేంటి?
ఆసీస్ జట్టులో భారీ మార్పులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.