అది కోహ్లీ ఇష్టం.. మా దారి మాదే: స్టోక్స్
దూకుడైనా దేహభాష కోహ్లీ, టీమ్ఇండియాకు పనిచేస్తుందేమో గానీ ఇంగ్లాండ్ ఆటతీరుపై ప్రభావం చూపదని ఆ జట్టు ఆల్రౌండర్ బెన్స్టోక్స్ అంటున్నాడు. మైదానంలో ఒక్కో జట్టు, ఒక్కో ఆటగాడు ఒక్కోలా సంబరాలు చేసుకుంటారని తెలిపాడు. బహుశా అదే వారిని విజయవంతం చేయొచ్చన్నాడు....
పుణె: దూకుడైన దేహభాష.. కోహ్లీ, టీమ్ఇండియాకు పనిచేస్తుందేమో గానీ ఇంగ్లాండ్ ఆటతీరుపై ప్రభావం చూపదని ఆ జట్టు ఆల్రౌండర్ బెన్స్టోక్స్ అంటున్నాడు. మైదానంలో ఒక్కో జట్టు, ఒక్కో ఆటగాడు ఒక్కోలా సంబరాలు చేసుకుంటారని తెలిపాడు. బహుశా అదే వారిని విజయవంతం చేయొచ్చన్నాడు. నాలుగైదేళ్లుగా తమ జట్టుకు పనిచేస్తున్న వ్యూహం మాత్రం అదికాదని వెల్లడించాడు. రెండో వన్డేకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.
‘మమ్మల్ని మెరుగైన జట్టుగా మార్చేందుకు అత్యుత్తమైన దారినే మేం ఎంచుకుంటాం. ప్రతి జట్టు తమకు అనువైన దారిలోనే నడుస్తుంది. భారత్, ఇంగ్లాండ్కు వేర్వేరు పద్ధతులు ఉన్నాయి’ అని స్టోక్స్ అన్నాడు. కోహ్లీ ప్రశాంతంగా ఉంటే బాగుంటుందా, దూకుడుగా ఉంటే బాగుంటుందా అని అడగ్గా ‘వ్యక్తిగతంగా చెప్పాలంటే అతడు పరుగులు చేయకపోతే బాగుంటుంది. ఎందుకంటే అది మా జట్టుకు మంచిది’ అని వెల్లడించాడు.
వన్డే సిరీస్ ఓడితే ఇంగ్లాండ్ నంబర్వన్ ర్యాంకు పోయే ప్రమాదముందని ప్రశ్నించగా ‘మా ఫలితాలు, మా ఆటతీరును బట్టి మేం నంబర్ వన్కు అర్హులం. అగ్రస్థానంలో ఉండటం ఎవరికైనా ఆనందమే. అయితే అదే మమ్మల్ని నడిపించడం లేదు. ఆట పట్ల మా వైఖరి, మేమెలా ఆడుతున్నామన్నదే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. అదే మమ్మల్ని విజయవంతం చేసింది. నంబర్ వన్గా మార్చింది’ అని స్టోక్స్ చెప్పాడు.
జో రూట్ లేకపోవడంతో మూడో స్థానంలో ఆడుతున్నానని ఇందుకోసం తన ఆటతీరును మార్చుకోలేదని స్టోక్స్ పేర్కొన్నాడు. ఆ స్థానంలో ఎలా ఆడాలని ప్రశ్నించగా ‘నీలా నవ్వు ఆడు’ అని రూట్ తనకు సమాధానం ఇచ్చాడని వెల్లడించాడు. ఫినిషర్గా సాధారణంగా 60 బంతులు ఆడితే మూడో స్థానంలో వంద వరకు ఎదుర్కోవాల్సి రావొచ్చన్నాడు. రాజస్థాన్ రాయల్స్కు ఓపెనింగ్ చేసినప్పటికీ ఇంగ్లాండ్లో ప్రతి స్థానానికి అర్హులైన వారు ఉన్నారని తెలిపాడు. లియామ్ లివింగ్స్టన్కు అవకాశం దొరికితే నిర్భయంగా అతడు క్రికెట్ ఆడగలడని ధీమా వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.